ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొవిడ్ రోగులు మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణం

పాలకులు, అధికారుల నిర్లక్ష్యం వల్లే అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో కొవిడ్ రోగులు మృతి చెందుతున్నారని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్నారు. కరోనాకు సంబంధించిన ఇంజక్షన్ లను.. అధిక డబ్బులకు అమ్ముకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

By

Published : May 2, 2021, 3:59 PM IST

మాజీ ఎమ్మెల్యే
former mla

అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసి పాలకులు కాసుల కోసం పరితపిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి విమర్శించారు. వీటన్నింటిపైనా యంత్రాంగం దృష్టి సాధించాల్సి ఉందని చెప్పారు. అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ కరోనా రోగుల స్థితిగతులను ప్రజలకు తెలపాలన్నారు. ప్రభుత్వ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని ఆయన డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details