ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆరోగ్యంపై అవగాహన..ఈరోడ్​ యువకుడు సైకిల్​ యాత్ర

కశ్మీర్​ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్​ యాత్రను చేస్తున్నాడు తమిళనాడుకు చెందిన విగ్నేష్​ అనే యువకుడు. ప్రస్తుతం తన యాత్రలో భాగంగా అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లకి చేరుకున్నాడు.

By

Published : Oct 5, 2019, 9:07 PM IST

Published : Oct 5, 2019, 9:07 PM IST

Updated : Oct 5, 2019, 10:18 PM IST

ఈరోడ్​ యువకుడు... సైకిల్​ యాత్ర చేస్తున్నాడు

సైకిల్​ తొక్కడం వల్ల ఆరోగ్య సమస్యలు ఉండవని తెలియజేసేందుకు తమిళనాడుకు చెందిన విగ్నేష్​ అనే యువకుడు సైకిల్​ యాత్ర చేపట్టాడు. కశ్మీర్​ నుంచి కన్యాకుమారికి తన ప్రయాణం ప్రారంభించాడు. ఇందులో భాగంగా శనివారం అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లికి చేరుకున్నాడు. ఇది తన చిరకాల కోరిక అన్నారు. మోటార్​ సైకిల్​ని వదిలి సైకిల్​ ప్రయాణం చేయాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 9 రాష్ట్రాల్లో సైకిల్​ యాత్రను పూర్తి చేసినట్లు వివరించారు. ప్రతి రోజు 100 నుంచి 150 కిలోమీటర్ల ప్రయాణం సాగిస్తున్నట్లు వివరించాడు. 3,500 కిలో మీటర్ల ప్రయాణంలో ప్రస్తుతం 2,500 కి.మీ సైకిల్​ యాత్రను పూర్తి చేశానని తెలిపాడు. ఈ యాత్రకు ప్రజల నుంచి మంచి సహాయ సహకారాలు అందుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు, స్నేహితుల ప్రోత్సాహం వల్ల సంతోషంగా యాత్ర నిర్వహిస్తున్నానని తెలిపాడు.

ఈరోడ్​ యువకుడు... సైకిల్​ యాత్ర చేస్తున్నాడు
Last Updated : Oct 5, 2019, 10:18 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details