ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బోరంపల్లి రోడ్డుపై పీపీఈ కిట్లు... ఆందోళనలో గ్రామస్థులు

అనంతపురం జిల్లా బోరంపల్లి సమీపంలో పీపీఈ కిట్లు కలకలం సృష్టించాయి. కళ్యాణదుర్గం-అనంతపురం ప్రధాన రహదారిపై పదుల సంఖ్యలో పీపీఈలు కిట్లు కనపడటంతో గ్రామస్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

By

Published : May 12, 2020, 11:46 PM IST

Published : May 12, 2020, 11:46 PM IST

ppe kits on borampalli road
బోరంపల్లి రోడ్డుపై పీపీఈ కిట్లు

అనంతపురం-కళ్యాణదుర్గం ప్రధాన రహదారిపై పీపీఈ కిట్లు చెల్లాచెదురుగా పడ్డాయి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి సమీపంలో పీపీఈ కిట్లు కనపడటంతో గ్రామస్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వీటిని చూడటానికి కూడా గ్రామస్థులు సాహసించలేదు. కొంతమంది యువకులు మాత్రం వెంటనే వాటిని పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఈ పీపీఈ కిట్లు వాడి పడేసినవా ? లేక కొత్తవా... ఇవి ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుపోతున్నారన్న విషయాలు తెలియాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details