ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కంకర క్వారీ గుంతలో పడి వ్యక్తి మృతి

By

Published : Nov 5, 2020, 10:45 PM IST

మద్యానికి బానిసై కంకర క్వారీ గుంటలో పడి మరణించాడు.. అనంతపురంలోని నందమూరి నగర్ నివాసి భాస్కర్. నిన్న ఇంటిలో గొడవపడి బయటకు వెళ్లగా.. ఈరోజు శవమై కనిపించాడు. ఆత్మహత్యా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

person died in gravel quary
మద్యం మత్తులో కంకర క్వారీలో పడి మృతిచెందిన వ్యక్తి

మద్యం మత్తులో నీటి గుంతలో పడి ఓ యువకుడు మృతి చెందాడు. అనంతపురంలోని నందమూరి నగర్​ చెందిన భాస్కర్ అనే వ్యక్తి ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తుండేవాడు. మద్యానికి బానిసై.. నిన్న సాయంత్రం ఇంటిలో గొడవపడి బయటికి వెళ్లినట్లు బంధువులు తెలిపారు.

కంకర క్వారీ గుంతలోని నీటిలో పడి ఈరోజు మృతి చెందినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఆత్మహత్యకు పాల్పడ్డడా అనే కోణంలో అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

ABOUT THE AUTHOR

...view details