ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా నాయకులారా.. పద్ధతి మార్చుకోండి: పరిటాల శ్రీరామ్

నిత్యం అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేసే వైకాపా నాయకులారా పద్ధతి మార్చుకోండని.. తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్ హెచ్చరించారు. కాగితాల మీద ఉత్తర్వులతో ప్రాజెక్టుల పేర్లు మార్చినంత మాత్రాన ప్రజల గుండెల్లో నిలిచిపోయిన పరిటాల రవీంద్రపై అభిమానం తగ్గదని ఆయన పేర్కొన్నారు.

By

Published : Dec 10, 2020, 5:18 PM IST

వైకాపా నాయకులరా.. పద్ధతి మార్చుకోండి: పరిటాల శ్రీరామ్
వైకాపా నాయకులరా.. పద్ధతి మార్చుకోండి: పరిటాల శ్రీరామ్

వైకాపా ప్రభుత్వంపై పరిటాల శ్రీరామ్ విమర్శలు గుప్పించారు. పేరూరు జలాశయానికి నీటిని తరలించే కాలవ కింద పుట్టకనుమ ప్రాజక్టు నిర్మాణ ఉత్తర్వును ఎందుకు రద్దు చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న ఇంజినీర్లే సర్వే నిర్వహించి పుట్టకనుమ జలాశయం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తే వైకాపా ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి రద్దు చేయించారన్నారు. పుట్టకనుమను రద్దుచేసి, మరో మూడుచోట్ల ప్రాజెక్టులు నిర్మించటాన్ని స్వాగతిస్తున్నామన్న పరిటాల శ్రీరామ్, కొత్త వాటికి ఎందుకు టెండర్లు నిర్వహించలేదని ప్రశ్నించారు. పరిటాల రవీంద్ర రక్తపుటేరులు పారించారంటున్న ఎంపీ మాధవ్... పరిటాల కుటుంబాన్ని తిట్టి ప్రయోజనం పొందాలంటే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. పోలీసు శాఖలో పనిచేసిన మాధవ్, పరిటాల రవి రక్తం పారించారో, పేద ప్రజలకు అండగా నిలిచారో మీకు తెలియదా..? అని ప్రశ్నించారు. అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయాలని చూస్తే పుట్టగతులు లేకుండా పోతారని వైకాపా నేతలను పరిటాల శ్రీరామ్ హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details