అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని రొళ్ళ మండల కేంద్రంలో ఐదు రోజుల క్రితం ఆంధ్రజ్యోతి దినపత్రికలో పని చేస్తున్న సీనియర్ పాత్రికేయుడు శ్రీ రంగప్ప అనారోగ్యంతో మృతి చెందారు. మడకశిరలోని ప్రెస్ క్లబ్ వద్ద నియోజకవర్గంలోని విలేకరులు సమావేశమై శ్రీ రంగప్ప మృతికి సంతాపం తెలిపారు. ఆయన సేవలను కొనియాడారు. ప్రెస్ క్లబ్ తరఫున వారి కుటుంబానికి అన్ని రకాల అండగా నిలుస్తామని పాత్రికేయులు పేర్కొన్నారు.