ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సీనియర్ పాత్రికేయుడు మృతికి సంతాపం తెలిపిన జర్నలిస్టులు

By

Published : Jul 19, 2020, 6:18 PM IST

రొళ్ళ మండలంలో ఐదు రోజుల క్రితం మృతి చెందిన సీనియర్ పాత్రికేయుడికి జర్నలిస్టులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ananthapuram district
సీనియర్ పాత్రికేయుడు మృతికి సంతాపం ప్రకటించిన తోటి విలేకర్లు

అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని రొళ్ళ మండల కేంద్రంలో ఐదు రోజుల క్రితం ఆంధ్రజ్యోతి దినపత్రికలో పని చేస్తున్న సీనియర్ పాత్రికేయుడు శ్రీ రంగప్ప అనారోగ్యంతో మృతి చెందారు. మడకశిరలోని ప్రెస్ క్లబ్ వద్ద నియోజకవర్గంలోని విలేకరులు సమావేశమై శ్రీ రంగప్ప మృతికి సంతాపం తెలిపారు. ఆయన సేవలను కొనియాడారు. ప్రెస్ క్లబ్ తరఫున వారి కుటుంబానికి అన్ని రకాల అండగా నిలుస్తామని పాత్రికేయులు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details