ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మడకశిర నగర పంచాయతీలో ఆర్​.డీ పరిశీలన

మున్సిపల్ ఆర్​ డీ షేక్అలీం భాష మడకశిర నగర పంచాయతీ లో పర్యటించి సమస్యలపై వాకబు చేశారు. ఆర్ డీ ని కలిసిన తెదేపా నేతలు 2014 పద్దతిలోనే వార్డులను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.

By

Published : Sep 9, 2019, 7:07 PM IST

Updated : Sep 9, 2019, 7:36 PM IST

మడకశిర నగర పంచాయతీ కార్యాలయంలో ఆర్​.డీ తనిఖీలు

అనంతపురం జిల్లా మడకశిర నగర పంచాయతీ కార్యాలయాన్ని మున్సిపల్ రీజినల్ డైరెక్టర్(ఆర్.డీ.)షేక్ అలీం భాష తనిఖీ చేశారు.తమ పరిధిలో ఉన్న అన్ని వార్డు వాలంటీర్ల శిక్షణ ప్రక్రియ పూర్తయిందని పేర్కొన్నారు.వార్డ్ సెక్రటరియేట్ గా ఉత్తీర్ణులైన అభ్యర్థులకు శిక్షణ కోసం సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.మడకశిర నగర పంచాయతీలోని సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఆర్ డీ తెలిపారు.

మడకశిర నగర పంచాయతీ కార్యాలయంలో ఆర్​.డీ తనిఖీలు

వార్డుల విభజన వద్దంటూ తెదేపా వినతిపత్రం
మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల విభజన సక్రమంగాజరగలేదని తెదేపా నేతలుఆర్.డీ కివినతి పత్రం సమర్పించారు. 2014మున్సిపల్ ఎన్నికల్లో ఉన్న వార్డుల పద్ధతిని కొనసాగించాలనివారు సూచించారు.

Last Updated : Sep 9, 2019, 7:36 PM IST

ABOUT THE AUTHOR

...view details