వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సామాన్య ప్రజలు, భాజాపా కార్యకర్తలపై దాడులు అధికమయ్యాయని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, భాజాపా రాష్ట్ర నాయకులు సూర్యనారాయణ అన్నారు. అనంతపురం జిల్లా ముదిగుబ్బలో పార్టీ కార్యకర్త లక్ష్మీనారాయణపై పోలీసులు అనవసరంగా దాడి చేశారని ఆరోపించారు. బాధితుడిని పరామర్శించి ఆయన 15000 ఆర్థిక సహాయం చేశారు. వైకాపా నాయకులు పరోక్షంగా కుట్రలుపన్ని పోలీసులతో దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. ఈ ఘటనను రాష్ట్ర నాయకులు దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పోలీసుల దాడిలో గాయపడిన వ్యక్తికి ఆర్ధిక సాయం
పోలీసుల దాడిలో గాయపడ్డ భాజపా కార్యకర్తను ధర్మవరం మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ పరామర్శించారు. బాధితుడి పరిస్థితిపై ఆరా తీసిన ఆయన 15వేలు ఆర్ధిక సాయం చేశారు. ఈ ఘటనను రాష్ట్ర నాయకుల దృష్టికి తీసుకెళ్లి కారకులపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
MLA's visit criticism and financial support