ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నియమ నిష్ఠతో.. స్వామిపై భక్తితో.. తాడు సిద్ధం

తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవులో మూడు టన్నుల బరువైన తాడును నియమ నిష్ఠలతో కార్మికులు సిద్ధం చేశారు. కదిరిలో వచ్చే నెల్లో జరిగే రథయాత్రకు దీన్ని ఉపయోగించనున్నట్లు చెప్పారు.

By

Published : Mar 3, 2021, 4:06 PM IST

three tons  roap
నియమ నిష్ఠతో.. స్వామిపై భక్తితో.. తాడు సిద్ధం

అనంతపురం జిల్లా కదిరిలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా వచ్చే నెల్లో నిర్వహించే స్వామివారి రథయాత్రకు అవసరమైన కొబ్బరి తాడును కార్మికులు 10 రోజులపాటు నిష్టగా శ్రమించి సిద్ధం చేశారు. తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవులో తాళ్ల వ్యాపారానికి ప్రసిద్ధి చెందిన సామా సతీశ్ తన వద్ద పనిచేసే కార్మికులతో 120 మీటర్ల పొడవు 26 అంగుళాల వైశాల్యం కలిగి మూడు టన్నుల బరువైన తాడును తయారు చేయించి కదిరికి పంపించారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ఆలయాల్లోని రథాలకు ఇక్కడి నుంచే తాళ్లను పంపిస్తున్నట్లు సతీశ్ తెలిపారు..

ABOUT THE AUTHOR

...view details