చమురు ధరల పెంపును నిరసిస్తూ అనంతపురం జిల్లాలో ప్రధాన రహదారిపై తెదేపా, వామపక్ష నాయకులు రాస్తారోకో చేశారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ఇప్పటికే నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటున్నాయని...ఈ పరిస్థితిల్లో ఇరవై రోజుల నుంచి పెట్రోల్ ధరలు పెంచుకుంటూ పోవటం బాధాకరమని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పెరిగిన పెట్రోల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామన్నారు.
ఇదీ చదవండి: