పేదలను ఖాళీ చేయించి.. పెద్దలను వదిలిపెట్టి..
సోమలదొడ్డి రెవెన్యూ గ్రామం సర్వే నెం.112లో 10.43 ఎకరాల అసైన్మెంటు భూమి ఉంది. ఈ భూమి గతంలో మాజీ సైనికులకు పంపిణీ చేశారు. వారి తాలూకూ వారసులు ఎవరూ లేకపోవడంతో నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలు సృష్టించి అమ్మకాలు చేశారు. ఈ సర్వే నెంబరులో మొత్తం ఏడు సబ్డివిజన్లు ఉన్నాయి. అందులో బాలనేరస్థుల పాఠశాలకు రెండు ఎకరాలు ఇచ్చారు. మరో రెండు ఎకరాల భూమిని గతంలో పనిచేసిన తహసీల్దార్లు కోటీశ్వరులైన వారికి పట్టాలు ఇచ్చారు. మిగిలిన భూమిలో ఏడాది క్రితం సీపీఐ ఆధ్వర్యంలో గుడిసెలు వేశారు. ఈ గుడిసెలను తొలగించడానికి రాజకీయ నాయకులు అనేక ఎత్తులు వేశారు. ప్రస్తుతం అక్కడ ఎకరా విలువ రూ.1.5 కోట్ల వరకు ఉంది. మీకు మూడెకరాల్లో పట్టాలు ఇప్పిస్తాం.. రెండువైపులా ఖాళీ చేయండని వారిని పురమాయించారు. నాయకుల మాయ తెలియని పేదలకు గుడిసెలు స్వచ్ఛందంగా తొలగించుకున్నారు. వెంటనే 1.24 ఎకరాల భూమికి ఓ వ్యాపారి, రెండు ఎకరాలకు మరో వ్యక్తి కంచె వేసుకున్నారు. పేదలు వేసుకున్న గుడిసెల్లో కొన్నింటిని పోలీసులు సమక్షంలో తొలగించారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న భూమిలో సోమలదొడ్డి గ్రామానికి చెందిన పెద్దలకే పట్టాలు ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నారు. మిగిలిన గుడిసెలను కూడా దౌర్జన్యంగా తొలగించడానికి ప్రయత్నాలు ముమ్మురం చేశారు.
పేదల సామాన్లు బయటికి విసిరేసి..