ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 8, 2021, 7:45 PM IST

ETV Bharat / state

కదిరిలో డ్రోన్ల సహాయంతో హైడ్రో క్లోరైడ్ ద్రావణం పిచికారీ

అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో డ్రోన్ల సహాయంతో హైడ్రోక్లోరైడ్ ద్రావణాన్ని చల్లారు. ఈ కార్యక్రమాన్ని హిందూపురం పార్లమెంటు సభ్యుడు గోరంట్ల మాధవ్, కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి ప్రారంభించారు. గాలిలో వైరస్ శాతం ఎక్కువ ఉందని..ప్రజలు మాస్కులు ధరించాలని నేతలు కోరారు.

   Hydro chloroquine solution spray with the help of drones
డ్రోన్ల సహాయంతో హైడ్రో క్లోరోక్వీన్ ద్రావణం పిచికారి

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న వేళ ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. వైరస్ తీవ్రతను తగ్గించే చర్యలు చేపడుతోంది. అనంతపురం జిల్లా కదిరి మున్సిపాలిటీ పరిధిలో హైడ్రోక్లోరైడ్ ద్రావకాన్ని డ్రోన్ల సహాయంతో చల్లారు. హిందూపురం పార్లమెంటు సభ్యుడు గోరంట్ల మాధవ్, కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి డ్రోన్ల సహాయంతో ద్రావణాన్ని చల్లే కార్యక్రమాన్ని ప్రారంభించారు. గాలి ద్వారా కూడా వైరస్ సోకే అవకాశం ఉందన్న శాస్త్రవేత్తల సూచన మేరకు.. డ్రోన్ల ద్వారా పట్టణంలోని ప్రధాన వీధుల్లో హైడ్రోక్లోరైడ్ చల్లుతున్నామని మున్సిపల్ అధికారులు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details