ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విషాదం..విద్యుదాఘాతంతో అన్నదమ్ములు మృతి

పొలానికి నీళ్లు పెట్టేందుకు...మోటారు బిగించే క్రమంలో విద్యుతాఘాతానికి గురై అన్నదమ్ములు మృత్యువాతపడిన ఘటన అనంత జిల్లా పొట్టిపాడులో జరిగింది.

By

Published : Sep 6, 2019, 7:57 PM IST

విద్యుదాఘాతం... ఇద్దరు అన్నదమ్ములు మృతి

విద్యుదాఘాతం... ఇద్దరు అన్నదమ్ములు మృతి

అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం పొట్టిపాడు లో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఉదయం పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి గంట వ్యవధిలోనే శవాలుగా మారారు. ఈరన్న, చంద్రలు కలిసి 6 ఎకరాలు పొలం గుత్తకు తీసుకొని మిరప పంట సాగు చేశారు. అయితే కాలవలో నీరు తగ్గడంతో... విద్యుత్ మోటర్ సాయంతో పొలానికి నీరు పెట్టాలని నిర్ణయించుకున్నారు. మోటర్లను బిగిస్తున్న సమయంలో విద్యుత్ షాక్​కు గురై మృతి చెందారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details