ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంటి పత్రాలు ఇవ్వటంలేదని కార్యాలయానికే తాళం

తీసుకున్న అప్పు చెల్లించి 8 నెలలైన తన ఇంటి పత్రాలను ఇవ్వలేదని..కదిరిలో ఓ ప్రైవేటు చిట్​ఫండ్ సంస్థకు తాళం వేశారు.

By

Published : Apr 27, 2019, 8:00 AM IST

కార్యాలయానికి తాళం

చిట్‌ఫండ్‌ కార్యాలయానికి తాళం

అనంతపురం జిల్లా కదిరిలో ఓ ప్రైవేటు చిట్​ఫండ్ సంస్థ కార్యాలయానికి తాళం వెశారు. పట్టణానికి చెందిన శంకర్ చారి ఇంటి పత్రాలను పెట్టి రుణం పొందారు. నిబంధనల ప్రకారం గడువులోగా అప్పు చెల్లించాడు. రుణం మొత్తం చెల్లించినట్టు సంబంధిత కార్యాలయం నుంచి పత్రాన్ని పొందారు. అప్పటి నుంచి ఇంటి దస్తావేజులు ఇవ్వాలంటూ చిట్​ఫండ్ కార్యాలయం చుట్టూ తిరిగాడు. 8 నెలలు గడిచినా ఫలితంలేకపోయింది. తన ఇంటిని వేరే వారికి అమ్మానని.. రిజిస్ట్రేషన్ కోసం తన డాక్యుమెంట్లు ఇవ్వాలని కోరారు. తన సమస్యపై కంపెనీ వారు స్పందించకపోవటంతో కార్యాలయానికి తాళం వేశాడు. తన పత్రాలు ఇచ్చేవరకు తాళం తీయనని.. బైఠాయించారు.

ABOUT THE AUTHOR

...view details