ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి: ఉప సభాపతి రఘుపతి

అనంతపురంలోని లలిత కళా పరిషత్​లో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సమాఖ్య జిల్లా శాఖ ఆద్వర్యంలో బ్రాహ్మణుల అభినందన ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి హాజరయ్యారు.

By

Published : Aug 18, 2019, 11:52 PM IST

brahmins congratulatory meeting in ananthapuram district

బ్రాహ్మణుల అభినందన సమావేశంలో శాసనసభ ఉప సభాపతి

వైకాపా ప్రభుత్వం బ్రాహ్మణుల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి అన్నారు. అనంతపురంలోని లలిత కళా పరిషత్​లో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సమాఖ్య జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బ్రాహ్మణుల అభినందన ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బడ్జెట్లో బ్రాహ్మణ కార్పొరేషన్​కు 100 కోట్లు కేటాయించామని, ప్రభుత్వం బ్రాహ్మణ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తోందన్నారు. 50 శాతం రిజర్వేషన్ అమలు అయ్యేలా చర్యలు తీసుకోవడం అభినందనీయమని చెప్పారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా వైకాపా బ్రాహ్మణుల అభివృద్ధికి తోడ్పాటు ఇస్తోందని తెలిపారు. సభ అనంతరం ఉపసభాపతిని బ్రాహ్మణులు ఘనంగా సన్మానించారు.

ABOUT THE AUTHOR

...view details