07:55 December 15
రైలు ఆపి బాంబు స్క్వాడ్, పోలీసుల తనిఖీలు
BOMB THREAT TO TRAIN: న్యూదిల్లీ-బెంగళూరు కర్ణాటక ఎక్స్ప్రెస్కు బాంబు బెదిరింపు ఫోన్ వచ్చింది. విషయాన్ని లోకో పైలెట్లకు తెలిపిన.. పై అధికారులు రైలును అనంతపురంలో ఆపారు. అప్పటికే అక్కడకు చేరుకున్న బాంబు స్క్వాడ్, పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఎలాంటి బాంబు లభించకపోయేసరికి రైలును పంపించివేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు ఆ దారిలో వెళ్తున్న అన్ని రైళ్లలో తనిఖీలు చేపడుతున్నారు.
ఇదీ చూడండి:
Farmers Padayatra: ముగిసిన అన్నదాతల యాత్ర...అమరావతిని రక్షించాలని స్వామీకి విన్నపం