ఇదీ చదవండి:
పెట్రోలు పోస్తుండగా మంటలు.. వాహనం దగ్ధం
అనంతపురం జిల్లా ధర్మవరంలో ద్విచక్ర వాహనచోదకుడు లక్ష్మీ నారాయణ రెడ్డి.. తన వాహనంలో పెట్రోల్ పోయించుకుంటుండగా ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. వెంటనే గమనించిన లక్ష్మీనారాయణ.. అక్కడి నుంచి పరుగులు తీశాడు. స్థానికులు అక్కడికి చేరుకుని ద్విచక్ర వాహనాన్ని రహదారిపైకి తెచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే వాహనం తగలబడింది.
పెట్రోలు పోస్తున్న సమయంలో వాహనంలో మంటలు