ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాయదుర్గంలో ఎలుగుబంటి స్వైరవిహారం

By

Published : Apr 29, 2020, 4:59 PM IST

అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎలుగుబంటి రోడ్లపై తిరుగుతూ ప్రజలను భయపెడుతోంది. చీకటి పడితే చాలు పొలాల్లో చొరబడుతోంది. పండ్ల తోటలను ధ్వంసం చేస్తుంది.

bear in ananthpuram rayadurgam
bear in ananthpuram rayadurgam

అనంతపురం జిల్లా రాయదుర్గంలోని బీటీపీ రోడ్డులో ఎలుగుబంటి సంచరిస్తోంది. చీకటిపడితే చాలు పొలాల్లోకి చొరబడి పండ్ల తోటలను నాశనం చేస్తోంది. అంతే కాదు రోడ్లపైకి వచ్చి ప్రజలను భయపెడుతోంది. లక్షల రూపాయలు ఖర్చుపెట్టి పండ్ల తోటలు సాగు చేసుకుంటే... కోతకు వచ్చిన పండ్లు చేజారిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి పూట బయటకు రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. ఎలుగుబంటి నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.

రాయదుర్గంలో ఎలుగుబంటి స్వైరవిహారం

ABOUT THE AUTHOR

...view details