ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'మూడు రాజధానులు కావాలంటే మళ్లీ ఎన్నికలకు వెళ్లండి'

అమరావతికి మద్దతుగా అనంతపురం జిల్లా మడకశిరలో ఎమ్మెల్సీ తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్యే ఈరన్న దీక్ష చేపట్టారు. మూడు రాజధానులపై ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తోందని విమర్శించారు.

By

Published : Aug 23, 2020, 7:39 PM IST

Published : Aug 23, 2020, 7:39 PM IST

amaravathi protest in madakasira ananthapuram district
అమరావతి దీక్ష

వైకాపా ప్రభుత్వ పాలన కంటే బ్రిటీష్ వారి పాలనే నయమని ఎమ్మెల్సీ తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్యే ఈరన్న అన్నారు. అమరావతికి మద్దతుగా అనంతపురం జిల్లా మడకశిరలో వారు అదివారం దీక్ష చేపట్టారు.

మూడు రాజధానుల ప్రతిపాదనను నిరసిస్తూ 29 గ్రామాల ప్రజలు 250 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదని వారు దుయ్యబట్టారు. మూడు రాజధానులు కావాలనుకుంటే అసెంబ్లీని రద్దుచేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని అన్నారు. అలా చేయకుంటే రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details