ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 21, 2021, 8:43 AM IST

ETV Bharat / state

అమరావతి అన్నదాతలకు విపక్ష నేతల సంఘీభావం

రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ.. అనంతపురం జిల్లా కదిరి విపక్షాల నేతలు ఆందోళనకు దిగారు. ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించేంత వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

amaravathi
కదిరిలో అమరావతి అన్నదాతలకు సంఘీభావం

రాజధాని అమరావతి పరిరక్షణ దీక్ష చేస్తున్న అన్నదాతలకు సంఘీభావం తెలుపుతూ... అనంతపురం జిల్లా కదిరిలో విపక్షాల నేతలు ఆందోళనకు దిగారు. రిలే నిరాహార దీక్ష చేపట్టారు. సీమ సమరం పేరుతో పరిరక్షణ సమితి కన్వీనర్ మనోహర్, ఇతర సభ్యులు దీక్షలు పాల్గొన్నారు.

విజయవాడలో...

అమరావతి రాజధాని భిక్ష కాదు చట్టబద్ధ హక్కు అని రాష్ట్ర సాగునీటి సంఘాల సమాఖ్య అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణా రావు అన్నారు. ఐకాస నాయకులతో కలిసి నిరసన దీక్ష చేపట్టారు. అమరావతి రాజధానికి భూములు ఇస్తే అభివృద్ధి చేయడం మానేసి పాలకులు రైతులను బూతులు తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రాజధానుల ప్రకటన రద్దు చేసి అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

తీవ్ర చర్చనీయాంశంగా ఎమ్మెల్యే పెద్దారెడ్డి తీరు

ABOUT THE AUTHOR

...view details