ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రెండు బైకులు ఢీ.. ఒకరు మృతి.. ఇద్దరికి గాయాలు

అనంతపురం జిల్లా ధర్మవరం మండలం సీసీ కొత్తకోట గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా.. ఇద్దరు గాయాలతో బయటపడ్డారు. మృతుడు పుట్టపర్తి మండలం బత్తలపల్లి తాండకు చెందిన రమణ నాయక్​గా గుర్తించారు.

By

Published : Dec 11, 2020, 7:32 AM IST

Published : Dec 11, 2020, 7:32 AM IST

accident at cc kothakota in Anantapur district
రెండు బైకులు ఢీ- ఒకరు మృతి.. ఇద్దరికి గాయాలు

అనంతపురం జిల్లా ధర్మవరం మండలం సీసీ కొత్తకోట గ్రామం వద్ద రాత్రి ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో పుట్టపర్తి మండలం బత్తలపల్లి తాండకు చెందిన ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తాండకు చెందిన రమణ నాయక్, రాజేశ్ బైకుపై ధర్మవరం నుంచి కొత్తచెరువు వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా వచ్చిన ద్విచక్రవాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గుర్ని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రమణ నాయక్​ను చికిత్స పొందుతూ మృతిచెందగా.. పోతలయ్య, రాజేశ్ నాయక్​కు చికిత్స పొందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details