ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కారెక్కుతున్న మరో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే

హస్తం పార్టీకి షాక్​ల మీద షాక్​లు తగుతున్నాయి. గెలిచిన శాసనసభ్యులంతా కారెక్కేందుకు వరుస కట్టారు. ఇప్పటికే ఆరుగురు గులాబీ కండువా కప్పుకుంటామని నిర్ణయించుకున్నారు. తాజాగా ఎమ్మెల్యే సుధీర్​రెడ్డి అదే జాబితాలో చేరిపోయారు.

By

Published : Mar 16, 2019, 6:51 AM IST

కాంగ్రెస్​కి మరో షాక్​...కారెక్కుతున్న సుధీర్​రెడ్డి

ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి గులాబీ కండువా కప్పుకోవాలనినిర్ణయించుకున్నారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​తో సమావేశమైన అనంతరం ఈ విషయాన్ని ప్రకటించారు. తెరాస ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు తనని ఆకట్టుకున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సమావేశంలో నియోజకవర్గ అభివృద్ధిపై కేటీఆర్ పూర్తిస్థాయి హామీ ఇచ్చినట్లు సుధీర్‌రెడ్డి తెలిపారు. ఎల్బీనగర్ పరిధిలోని చెరువుల సుందరీకరణతోపాటు బీఎన్ రెడ్డినగర్‌ రిజిస్ట్రేషన్ల సమస్య పరిష్కరంపై హామీ ఇచ్చారన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details