ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 26, 2023, 5:10 PM IST

Updated : Jan 26, 2023, 5:20 PM IST

ETV Bharat / state

మల్కన్​గిరిలో ముగ్గురు మావోయిస్టులు లొంగుబాటు

Maoists surrendered to police: ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలో గల మల్కన్​గిరి జిల్లాలో ముగ్గురు మావోయిస్టులు పోలీసులకు లొంగిపోయారు. గురువారం ఒడిశా ఇంటిలిజెన్స్ డైరెక్టర్ సంజీవపండ ఎదుట లొంగిపోయారు. వీరు 2017 నుంచి మహుపదర్ ప్రాంతంలో దండకారణ్య దళంలో పని చేస్తున్నారు. మిగిలిన మావోయిస్టు నేతలు కూడా లొంగిపోతే పూర్తి సహకారం అందిస్తామని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.

maoists surrender
maoists surrender

Maoists surrendered to police: ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో గల మల్కన్​గిరి జిల్లాలో ముగ్గురు మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. గురువారం ఒడిశా ఇంటెలిజెన్స్ డైరెక్టర్ సంజీవపండ ఎదుట లొంగిపోయారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల వలన స్వాభిమానం ప్రాంతంలో మావోయిస్టులకు ప్రజలు సహకరించడం లేదని వారు అభిప్రాయపడ్డారు. లొంగిపోయిన వారిలో పండు కబాసి, మనోజ్​, ఐటకర్తమిలు ఉన్నారు. వీరు 2017 నుంచి మహుపదర్ ప్రాంతంలో దండకారణ్య దళంలో పని చేస్తున్నారు. లొంగిపోయిన ముగ్గురుకి లక్ష రూపాయల చొప్పున రివార్డ్ నగదు చెల్లించారు. మిగిలిన మావోయిస్టు నేతలు కూడా లొంగిపోతే పూర్తి సహకారం అందిస్తామని పోలీస్ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

Last Updated : Jan 26, 2023, 5:20 PM IST

ABOUT THE AUTHOR

...view details