ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / sports

కివీస్​ క్లీన్​స్వీప్​...భారత్​కు తప్పని ఓటమి

న్యూజిలాండ్​తో జరిగిన మూడు మ్యాచ్​ల టీ20 సిరీస్​లో భారత మహిళా జట్టు ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఉత్కంఠగా సాగిన మూడో మ్యాచ్​లోనూ రెండు పరుగుల తేడాతో ఓడిపోయింది.3-0 తో సిరీస్​ను కివీస్​ క్లీన్​స్వీప్​ చేసింది.

By

Published : Feb 10, 2019, 11:47 AM IST

Updated : Feb 10, 2019, 1:17 PM IST

కివీస్​ చేతిలో మూడో టీ-ట్వంటీలోనూ ఓడిపోయింది భారత మహిళా జట్టు

మూడో టీ-ట్వంటీలో మహిళల ఓటమి
న్యూజిలాండ్​ పర్యటనలో వన్డే సిరీస్‌ గెలిచిన భారత మహిళా జట్టు... టీ20 సిరీస్​లో ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. కివీస్​తో జరిగిన మూడు మ్యాచ్​ల్లోనూ ఓడి 0-3తో సిరీస్​ చేజార్చుకుంది హర్మన్​ప్రీత్​ సేన.

హామిల్టన్​ వేదికగా జరిగిన మూడో టీ-ట్వంటీలో టాస్​ గెలిచి మొదట బ్యాటింగ్​ చేసిన న్యూజిలాండ్​ మహిళా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 161 పరుగులు చేసింది. భారత్ జట్టు 20 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. రెండు పరుగుల తేడాతో ఓడిపోయింది. చివరి బంతి దాకా మ్యాచ్​ ఉత్కంఠగా సాగింది.

అవకాశాలను వినియోగించుకోలేదు...

సిరీస్​లోని మూడు టీ20ల్లోనూ గెలుపు అవకాశాలను చేజార్చుకుంది భారత జట్టు. ఓ దశలో గెలిచేలా కనిపించినా కీలక సమయాల్లో వికెట్లు కోల్పోయి ఓటమి పాలైంది.
మూడో టీ-ట్వంటీలోనూ లక్ష్యాన్ని సులువుగా ఛేదిస్తుందనే దశ నుంచి ఓటమి వైపుగా నడిచింది. 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి విజయానికి చేరువలోకి వచ్చి రెండు పరుగుల తేడాతో ఓడింది.

మంధాన పోరాటం వృథా

స్మృతి మంధాన మెరుపు ఇన్నింగ్స్​
ఓపెనర్​ స్మృతి మంధాన చేసిన పోరాటం వృథా అయింది. ఇన్నింగ్స్​ ప్రారంభం నుంచే ధాటిగా ఆడిన మంధాన కివీస్​ బౌలర్లపై విరుచుకుపడింది. మరో ఓపెనర్​ ప్రియా పూనియా తక్కువ స్కోర్​కే అవుటైనా మంధాన ఎదురుదాడి కొనసాగించింది. 62 బంతుల్లో 86 పరుగులు చేసి భారత్​ను విజయం దిశగా నడిపించింది. 16వ ఓవర్లో సోఫియా డెవిన్​ మంధానను అవుట్​ చేసింది.

చివర్లో ఉత్కంఠ

మంధాన అవుటైన తర్వాత పరుగులు మందగించాయి. బంతులు... చేయాల్సిన పరుగుల మధ్య అంతరం పెరిగిపోయింది. మిథాలీ, దీప్తి శర్మపై ఒత్తిడి పెరిగింది. చివరి ఓవర్లో 17 పరుగులు అవసరమయ్యాయి. కాస్పెర్క్​​ వేసిన తొలి బంతినే బౌండరీగా మలిచి గెలుపుపై ఆశలు రేపింది మిథాలీ రాజ్​. మూడో బంతికి మరో బౌండరీ సాధించిన దీప్తి శర్మ భారత్​ను లక్ష్యానికి చేరువ చేసింది. చివరి మూడు బంతులకు 7 పరుగులు కావాల్సి ఉండగా నాలుగు పరుగులు మాత్రమే వచ్చాయి. లక్ష్యానికి మూడు పరుగుల దూరంలో ఆగిపోయింది భారత జట్టు.

కివీస్​ ఓపెనర్ల జోరు

ఓపెనర్లు సోఫీ డేవిన్​, సుజీబేట్స్​ కివీస్​కు శుభారంభాన్నిచ్చారు. తొలి వికెట్​కు 46 పరుగులు జోడించారు. బేట్స్​ను అవుట్​ చేసి అరుంధతి రెడ్డి వీరి జోడిని విడదీసింది. మరో ఓపెనర్​ సోఫీ డివైన్​ దూకుడైన బ్యాటింగ్​తో స్కోర్​ బోర్డును పరుగులు పెట్టించింది. 52 బంతుల్లో 72 పరుగులు చేసి డివైన్​ పెవిలియన్​కు చేరింది. 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది కివీస్​.

స్కోర్లు..

కివీస్​ ఇన్నింగ్స్​: 161/7వికెట్లు

సోఫీ డెవిన్​ 72 ( 52 బంతుల్లో), సూజీ బేట్స్​ 24 (18), హన్నా రోవే 12 (9), ఆమీ సటేర్​వేయిట్​ 31 (23), కేటీ మార్టిన్​ 8 (8), అన్నా పీటర్సన్​ 7 (5 బంతుల్లో నాటౌట్​), లేహ్​ కాస్పెర్క్​ 0 (1), లీ తాహూహూ 5 (4)

భారత్​ ఇన్నింగ్స్​: 159/4

ప్రియా పూనియా 1 (2 బంతులు), స్మృతి మంధానా 86 (62), రోడ్రిగ్స్​​ 21 (17), హర్మన్​ ప్రీత్​ కౌర్​ 2 (3), మిథాలి రాజ్​ 24 (20నాటౌట్​), దీప్తీ శర్మ 21 (16 బంతుల్లో నాటౌట్​).

Last Updated : Feb 10, 2019, 1:17 PM IST

ABOUT THE AUTHOR

...view details