ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

సిట్​ ముందుకు అశోక్​..?

డేటా చోరీ కేసులో ఐటీ గ్రిడ్స్​ సంస్థ సీఈఓ అశోక్​కు తెలంగాణ సిట్​ నోటీసులు జారీ చేస్తూనే ఉంది. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న అశోక్​ విచారణకు హాజరవుతారా..? లేదా..? అన్నది ఉత్కంఠంగా మారింది.

By

Published : Mar 13, 2019, 11:27 AM IST

Updated : Mar 13, 2019, 11:34 AM IST

సిట్​ ముందుకు అశోక్​..?

సిట్​ ముందుకు అశోక్​..?
డేటా చోరీకేసులో ప్రధాన నిందితుడైన ఐటీ గ్రిడ్స్​ సంస్థ సీఈఓ అశోక్​.. తెలంగాణ సిట్​ ఎదుట ఇవాళ విచారణకు హాజరు కావాల్సి ఉంది. మాదాపూర్​లోని ఐటీ గ్రిడ్స్​, బ్లూఫ్రాగ్​ సంస్థల్లో పోలీసులు సోదాలు నిర్వహించి ఉపకరణాలు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలంటూ ఈ నెల 2, 3 తేదీల్లో నోటీసులు జారీ చేసినా అశోక్​ స్పందించలేదు. మళ్లీ నోటీసులను కూకట్​పల్లి హౌజింగ్ బోర్డులోని ఆయన ఇంటికి అంటించారు. ఈ రోజూ విచారణకు అశోక్ హాజరు కాకపోతే తెలంగాణ సిట్‌ అధికారులు తదుపరి చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

ఇదీ చూడండి:

Last Updated : Mar 13, 2019, 11:34 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details