ETV Bharat / jagte-raho
సిట్ ముందుకు అశోక్..?
డేటా చోరీ కేసులో ఐటీ గ్రిడ్స్ సంస్థ సీఈఓ అశోక్కు తెలంగాణ సిట్ నోటీసులు జారీ చేస్తూనే ఉంది. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న అశోక్ విచారణకు హాజరవుతారా..? లేదా..? అన్నది ఉత్కంఠంగా మారింది.
By
Published : Mar 13, 2019, 11:27 AM IST
| Updated : Mar 13, 2019, 11:34 AM IST
సిట్ ముందుకు అశోక్..?
డేటా చోరీకేసులో ప్రధాన నిందితుడైన ఐటీ గ్రిడ్స్ సంస్థ సీఈఓ అశోక్.. తెలంగాణ సిట్ ఎదుట ఇవాళ విచారణకు హాజరు కావాల్సి ఉంది. మాదాపూర్లోని ఐటీ గ్రిడ్స్, బ్లూఫ్రాగ్ సంస్థల్లో పోలీసులు సోదాలు నిర్వహించి ఉపకరణాలు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలంటూ ఈ నెల 2, 3 తేదీల్లో నోటీసులు జారీ చేసినా అశోక్ స్పందించలేదు. మళ్లీ నోటీసులను కూకట్పల్లి హౌజింగ్ బోర్డులోని ఆయన ఇంటికి అంటించారు. ఈ రోజూ విచారణకు అశోక్ హాజరు కాకపోతే తెలంగాణ సిట్ అధికారులు తదుపరి చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇదీ చూడండి:
Last Updated : Mar 13, 2019, 11:34 AM IST