ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

మెయిల్ ఐడీ హ్యాక్ చేసి 8 లక్షలు చోరీ

సైబర్‌ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఆ మోసగాళ్లు అమాయకుల జేబులకు చిల్లు పెడుతున్నారు. తాజాగా హైదరాబాద్​కు చెందిన ఇద్దరు వ్యక్తుల నుంచి 14.3 లక్షల రూపాయలు కాజేశారు. తెలుసుకున్న బాధితులు సైబర్​ క్రైమ్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

By

Published : Dec 13, 2020, 6:46 AM IST

cyber-hackers
cyber-hackers

సైబర్ నేరగాళ్లు హ్యాక్​ చేసి 14.3 లక్షలు దోచుకున్నారు. తెలంగాణలోని సికింద్రాబాద్​కు చెందిన డాక్టర్ అర్జున్ రావు ఇంటర్నెట్ బ్యాంకింగ్​​తో లింకై ఉన్న మెయిల్ ఐడీని హ్యాక్ చేసి 8 లక్షల రూపాయలను.. సైబర్ చీటర్స్ కాజేశారు. మరో ఘటనలో... కాచిగూడకి చెందిన శేషగిరిరావు తన క్రెడిట్ కార్డ్ బిల్లు ఆన్​లైన్​లో కట్టే సందర్భంలో ఓ యాప్ డౌన్​లోడ్​ చేశాడు.

తన అకౌంట్​లో ఉన్న 6.3 లక్షల రూపాయలు మాయమయ్యాయి. మోసపోయామని తెలుసుకున్న ఇద్దరు బాధితులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదైంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఈ మెయిల్ లింక్ ఉన్న వినియోగదారులు మెయిల్​కి వచ్చే ఓటీపీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details