ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

తెలంగాణ: వజ్రాలను గోడల్లో దాచారు... కొట్టంలో పాతారు

హైదరాబాద్ బంజారాహిల్స్​లోని ఓ వ్యాపారి ఇంట్లో ఇటీవల జరిగిన చోరీలో బిహారీ దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారు ఆ సొమ్మును దాచిపెట్టిన ప్రాంతాన్ని చూసి పోలీసులే కంగుతిన్నారు.

By

Published : Feb 13, 2020, 11:11 PM IST

bihar-thives-stolen-diamonds-kept-at-farm-house-at-bihar
వజ్రాలను గోడల్లో దాచారు... కొట్టంలో పాతారు

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఓ వ్యాపారి ఇంట్లో డిసెంబరు 8న రూ.కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలను బిహారీ ముఠా దొంగిలించింది. చోరీ చేశాక ముఠా సభ్యులు బిహార్‌లోని మధుబని ప్రాంతానికి పారిపోయారు. బంగారు నగలను అమ్మి సొమ్ము చేసుకున్నారు. వజ్రాల, నగలు మాత్రం మూటగట్టి ఓ ఇంట్లోని పశువుల కొట్టంలోని భూమిలో పాతిపెట్టారు. మరికొంత గోడలో దాచిపెట్టారు.

ఆరుగురు నిందితుల్లో నలుగురిని అరెస్టు చేసిన పోలీసుల బృందం సొత్తును చాకచక్యంగా స్వాధీనం చేసుకున్నట్లు హైదరాబాద్‌ నగర కమిషనర్‌ అంజనీకుమార్‌ బుధవారం హైదరాబాద్‌లో వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details