ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

అత్తా కోడళ్ల ఘర్షణ.. చిన్నారి ప్రాణం బలి

అత్తా కోడళ్ల మధ్య జరిగిన గొడవకి అభంశుభం తెలియని చిన్నారి బలైంది. తల్లి ఆవేశానికి తొమ్మిది నెలల పాప మృతి చెందింది. ఈ ఘటన తెలంగాణ మహబూబ్​నగర్​ జిల్లా గండీడ్‌ మండలంలోని జక్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

By

Published : Dec 12, 2020, 11:17 AM IST

a-clash-between
a-clash-between

అత్తా కోడళ్ల ఘర్షణ ఓ చిన్నారి ప్రాణం తీసింది. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ మహబూబ్​నగర్​ జిల్లా గండీడ్‌ మండలం జక్లపల్లికి చెందిన ఓ ఇల్లాలు ఇంట్లో తన అత్తతో గొడవకు దిగింది. అత్తా కోడళ్లు మాటా మాటా అనుకుంటూ.. అత్త చేతిలో ఉన్న తన తొమ్మిది నెలల చిన్నారిని కోడలు కోపంగా తీసుకుని కింద పడేసింది. దీంతో చిన్నారి స్పృహ తప్పి పడిపోయింది. చికిత్స నిమిత్తం కోస్గిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు తెలిపారు.చిన్నారి తల్లి మద్యం మత్తులో అత్తతో గొడవ పెట్టుకుని ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గ్రామస్థులు పేర్కొన్నారు. చిన్నారిని బలి తీసుకున్న కసాయి తల్లిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details