ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / international

అమెరికాపై చలి పంజా : మైనస్​ 53 డిగ్రీలకు ఉష్ణోగ్రత

చలి తీవ్రత పశ్చిమ మధ్య  అమెరికాను కుదిపేస్తోంది. నదులు, సరస్సుల్లో నీరు గడ్డకట్టుకుపోయింది.

By

Published : Feb 2, 2019, 11:28 AM IST

Updated : Feb 2, 2019, 11:58 AM IST

అమెరికాలో గడ్డ కట్టిన నదులు, సరస్సులు

అమెరికాలో గడ్డ కట్టిన నదులు, సరస్సులు
అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రత ధాటికి పశ్చిమ మధ్య అమెరికా వణికిపోతోంది. చలి బీభత్సంతో ఇప్పటి వరకు 21 మంది మృతి చెందారు.

మిన్నెసొటా, విస్​కాన్సిన్​ ప్రాంతాల్లో మైనస్​ 53 డిగ్రీల సెల్సీయస్​లకు ఉష్ణోగ్రత పడిపోయింది. జన జీవనం అస్తవ్యస్తమయింది. రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. వేలాది విమాన సర్వీసులు రద్దయ్యాయి.

గడ్డ కట్టుకుపోయిన నదులు

నదులు, సరస్సులు, కాలువలు, మంచి నీటి వనరులు గడ్డకట్టుకుపోయాయి. రోడ్లపై మంచు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయింది. ప్రజలు ఇంట్లోనుంచి కాలు బయటపెట్టలేని పరిస్థితి.

ఉష్ణోగ్రతలో స్వల్పంగా మార్పు కారణంగా గడ్డకట్టిన మంచు కరిగి వరదలు సంభవించే ప్రమాదముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Last Updated : Feb 2, 2019, 11:58 AM IST

ABOUT THE AUTHOR

...view details