ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / elections

సీఎం జగన్ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలోని ముఖ్యాంశాలు

By

Published : Aug 15, 2019, 10:31 AM IST

Updated : Aug 15, 2019, 1:44 PM IST

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/15-August-2019/4141130_484_4141130_1565844916229.png

11:09 August 15

కులాలు, మతాలు, ప్రాంతాలు చూడకుండా అందరికీ న్యాయం జరిగేలా పాలన అందిస్తున్నాం

ఒక మనిషి మరో మనిషిని దోచుకోలేని సమాజాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నాం

దేవుడు కూడా మనపై కరుణ చూపిస్తున్నాడు

జలాశయాలన్నీ నిండి కళకళలాడుతున్నాయి

మంచి చేస్తున్న దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నా

11:09 August 15

ప్రజలకు ఏ అవసరం వచ్చినా ప్రభుత్వం అండగా ఉందని చెప్పేందుకు స్పందన తీసుకొచ్చాం

ప్రభుత్వ కార్యాలయాల్లో స్పందన కార్యక్రమం అమలు చేస్తున్నాం

ఒక ఫిర్యాదును ఎప్పటిలోగా పరిష్కరిస్తామన్నది ముందు తెలుపుతున్నాం

ఇచ్చిన మాట ప్రకారం ఫిర్యాదును పరిష్కరించేలా ముందుకెళ్తున్నాం

స్పందన కార్యక్రమంపై కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నాం

లంచాలు, పక్షపాతం లేకుండా ప్రతి ప్రభుత్వ పథకం వారి ఇంటికి చేరేలా చర్యలు

దేశచరిత్రలోనే సామాజిక, ఆర్థిక, రాజకీయ విప్లవానికి మొదటి బడ్జెలోనే శ్రీకారం చుట్టాం

11:09 August 15

ఉద్యోగులకు అండగా నిలిచేందుకు 27 శాతం ఐఆర్‌ ఇచ్చాం

అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్‌కు బదులు పాత పింఛన్‌ విధానం ఇచ్చేందుకు చర్యలు

ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేసేందుకు కమిటీ వేశాం... సిఫార్సుల కోసం ఎదురుచూస్తున్నాం

హోంగార్డులు, అంగన్వాడీలు, పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు పెంచాం

దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా పోలీసులకు వీక్లీఆఫ్‌ అమలు చేస్తున్నాం

సొంతంగా ఆటోలు కొన్నవాళ్లకు, చేనేతలు, మత్స్యకారులు, దర్జీలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాం

11:09 August 15

అర్హులైన ప్రతిఒక్కరికి ఉగాది నాటికి ఇళ్ల స్థలాలు

దాదాపు 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేయబోతున్నాం

వచ్చే బడ్జెట్‌ను అక్కచెల్లెమ్మలకు అంకితం చేయబోతున్నాం

నాలుగు దఫాల్లో రూ.27,147 కోట్లను పొదుపు సంఘాలకు ఇవ్వబోతున్నాం

పొదుపు సంఘాల్లో ఉన్నవారికి వడ్డీ భారాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది

రెండో ఏడాది నుంచి వైఎస్‌ఆర్‌ చేయూతను తీసుకొస్తున్నాం

45 ఏళ్లు దాటిన ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు కార్పొరేషన్ల ద్వారా రూ.75 వేలు సాయం చేయబోతున్నాం

11:07 August 15

రూ.వెయ్యి ఉన్న పింఛన్‌ను రూ.2,250కి తీసుకెళ్లాం

వచ్చే ఏడాది నుంచి ఏటా రూ.250 పెంచుకుంటూ వెళ్తాం

అర్హత వయస్సును 65 నుంచి 60 ఏళ్లకే తగ్గించాం

వంద శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తాం

ఉన్నత విద్య కోర్సులు అభ్యసించే విద్యార్థులకు వంద శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌

వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ ద్వారా పేదప్రజలకు వైద్య భద్రతకు చర్యలు

రూ.వెయ్యి బిల్లు దాటితే ఎవరికైనా.. నెలకు రూ.40 వేలు సంపాదించేవారికి కుడా ఆరోగ్యశ్రీ వర్తింపు
2022 జులై నాటికి కార్పొరేట్‌ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చిదిద్దుతున్నాం

2,031 వ్యాధులకు ఆరోగ్యశ్రీ వర్తింపు చేస్తున్నాం

108, 104 అంబులెన్సులు మళ్లీ దారిలోకి పెట్టబోతున్నాం

1000 అంబులెన్స్‌లను కొనుగోలు చేయబోతున్నాం

జనవరి 1 నుంచి పూర్తిగా అందుబాటులోకి తీసుకొస్తాం

11:06 August 15

దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా అమ్మఒడి పథకం అవలంబిస్తున్నాం

జనవరి 26న ఈ పథకానికి నాంది పలుకుతున్నాం

చదువుల విప్లవంతో పాఠశాలల రూపురేఖలు మార్చబోతున్నాం

అమ్మఒడి పథకం ద్వారా రూ.15 వేలు ఇవ్వబోతున్నాం

మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చబోతున్నాం

బడులు ప్రారంభించేనాటికి విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు, బూట్లు అందించబోతున్నాం

కేజీ నుంచి పీజీ వరకు ప్రతి స్థాయిలోనూ పేద కుటుంబాల పిల్లలకు అండగా ఉంటాం

నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రతి ప్రయత్నం చేస్తున్నాం

11:06 August 15

జీడీపీ ఒక్కటేకాదు.. మానవ అభివృద్ధి సూచికను మెరుగుపరచాలని నిర్ణయించాం

పల్లెల్లో ఉన్నవారికి కూడా సంక్షేమాన్ని అందించేలా చర్యలు తీసుకుంటున్నాం

ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నాం

గ్రామాలు బాగుంటేనే రాష్ట్రం బాగుపడుతుందని నమ్ముతున్నా

పంచాయతీల్లో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేస్తున్నాం

పట్టణాల్లో వార్డు సచివాలయాలు ఏర్పాటు చేస్తున్నాం

శాశ్వత ఉద్యోగాలతో పాటు గ్రామ, పట్టణ ప్రాంతాల్లో ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌

వాలంటీర్ల వ్యవస్థ ప్రారంభానికి ఇవాళే శ్రీకారం చుడుతున్నాం

మరో 2.66 లక్షల ఉద్యోగాలను ఇవ్వబోతున్నాం

అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 4 లక్షలకుపైగా ఉద్యోగాలు కల్పించబోతున్నాం

గ్రామ, వార్డు వాలంటీర్ల నియామకాల్లో మహిళలకు సగం వాటా ఇస్తున్నాం

10:57 August 15

గోదావరి జలాలను సాగర్‌, శ్రీశైలానికి తరలించడం ద్వారా కృష్ణా ఆయకట్టును స్థిరీకరించేలా ప్రణాళికలు

నీటిపారుదల ప్రాజెక్టులన్నీ యుద్ధప్రాతిపదికన పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నాం

మెట్టప్రాంత రైతుల కోసం 200 రిగ్గులు కొనుగోలు చేసి ఉచితంగా వేయబోతున్నాం

అప్పులపాలవుతున్న రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది

పొగాకు ధరలు తగ్గుతున్నాయని తెలిసి ధరల స్థిరీకరణకు వెంటనే చర్యలు తీసుకున్నాం

పారిశ్రామిక, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి పెట్టాం

పారిశ్రామికంగా అభివృద్ధి కావడానికి అన్ని మౌలిక సదుపాయాలు ఉన్న రాష్ట్రం మనది

కొత్త పరిశ్రమలు, ఉద్యోగాలు పెంచే ప్రతి ప్రయత్నం చేస్తున్నాం

విద్యా ప్రమాణాలు మెరుగుపరచడం, సాంకేతిక నైపుణ్యాలను పెంచడమే లక్ష్యం

10:41 August 15

- రైతు ఆనందం - రైతు ఆదాయం పెరిగేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నాం

- రైతులకు రూ.84 వేల కోట్లు పంట రుణాలుగా అందించాలని నిర్ణయించాం

- గడువులోగా రుణాలు చెల్లిస్తే పంట రుణాలపై వడ్డీ భారాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది

- ఇప్పటికే 60 శాతం ఫీడర్లలో వ్యవసాయానికి పగటిపూటే విద్యుత్‌ ఇవ్వాలని ఏర్పాట్లు చేశాం

- వచ్చే ఏడాది జులై నాటికి మిగిలిన 40 శాతం ఫీడర్లలో పగటిపూటే విద్యుత్‌ ఇవ్వాలని ఏర్పాట్లు చేస్తున్నాం

10:37 August 15

కమీషన్లు, దోపిడీలుగా మారిన వ్యవస్థను మారుస్తున్నాం

టెండర్‌ పనుల ఖారరు ప్రక్రియ హైకోర్టు జడ్జి ముందు పెడుతున్నాం

దేశచరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా టెండర్ల ప్రక్రియలో అత్యుత్తమ విధానాలకు శ్రీకారం

అవినీతికి ఆస్కారం లేకుండా రివర్స్‌ టెండరింగ్‌ విధానం తీసుకొస్తున్నాం

వివిధ ప్రభుత్వ శాఖల్లో రూ.కోటి దాటిన ఏ కొనుగోళ్లయినా పారదర్శకత పాటించేలా ఆన్‌లైన్‌ వ్యవస్థ

కొనుగోలు చేయాల్సిన వస్తువులు నాణ్యతా ప్రమాణాలతో తక్కువ ధరకు ముందుకొస్తే అవకాశం కల్పిస్తున్నాం

భూములు కొనాలంటే భయపడే పరిస్థితి పోవాలని ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు తీసుకొస్తున్నాం

అక్రమ రిజిస్ట్రేషన్లు, నకిలీ రికార్డులకు చెక్‌ పెట్టిన మొట్టమొదటి ప్రభుత్వం మనది

10:35 August 15

- మానవ అభివృద్ధి సూచికలో మనం ఎక్కడ ఉన్నామో ఆలోచించుకోవాలి

- వ్యవసాయం, పరిశ్రమ, సేవా రంగాల్లో ఎంత అభివృద్ధి ఉందో చూడాలి

- దళారీ వ్యవస్థ, అవినీతి అంతకంటే వేగంగా బలపడింది

- అవినీతిని రూపుమాపేలా చర్యలు తీసుకుంటున్నాం

- గ్రామాన్ని మార్చేందుకు గ్రామసచివాలయాలు తీసుకొచ్చాం

- రైతులు, పేదలకు ఉచితంగా విద్యుత్‌ ఇవ్వాలని కృషిచేస్తున్నాం

- విద్యుత్‌ ఛార్జీలు తగ్గించాలని అడిగితే విద్యుత్‌ సంస్థలు గగ్గోలు పెడుతున్నాయి

- పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు కచ్చితంగా స్థానికులకే ఇవ్వాలని చెప్పాం

- సామాజిక న్యాయ చరిత్రలోనే లేనివిధంగా బడుగులు, బలహీనవర్గాలు, మహిళలకు పెద్దపీట వేశాం

- బీసీ కమిషన్‌ ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి రాష్ట్రం మనదని గట్టిగా చెబుతున్నాం

- బీసీ కులాలు అంటే భారతీయ సంస్కృతి, నాగరికతలకు బ్యాక్‌ బోన్‌ క్లాసులుగా చూస్తామని చెప్పాం

- రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా బీసీ కమిషన్‌ ఏర్పాటు చేశాం

- భారతదేశ రాజకీయ చరిత్రను మలుపు తిప్పేలా సామాజిక న్యాయానికి చట్టాలు తీసుకొచ్చాం

- బీసీ, ఎస్సీ, ఎస్టీలకు నామినేటెడ్‌ పదవులకు 50 శాతం రిజర్వేషన్లు ఇస్తూ చట్టం చేశాం

- బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు నామినేటెడ్‌ పనుల్లోనూ 50 శాతం రిజర్వేషన్లు ఇస్తూ చట్టం చేశాం

- అధికారంలోకి వచ్చిన కేవలం రెండు నెలల్లోనే చేశానని గర్వంగా చెబుతున్నా

- ప్రభుత్వ నామినేటెడ్‌ పదవుల్లోనూ గతంలో లేనివిధంగా మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇస్తూ చట్టం చేశాం

- పరిశ్రమలు, ఫ్యాక్టరీల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే కల్పించేలా చట్టం చేశాం

- పరిశ్రమలకు దరఖాస్తు చేస్తున్నప్పుడే స్థానికులకు శిక్షణ ఇచ్చి వెన్నుదన్నుగా నిలబడాలని నిర్ణయించాం-

- భూ యజమాని హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా కౌలు రైతులకు వైఎస్‌ఆర్‌ రైతు భరోసా

- రైతు భరోసాతో పాటు ఉచితంగా పంటల బీమా కల్పించాం

- కార్పొరేట్‌ సంస్కృతిని మార్చేందుకు పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్‌ చేశాం

- పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలిచిన ప్రభుత్వం మనదని చెప్పడానికి గర్వపడుతున్నా

10:34 August 15

- ప్రజల అవసరాలకు అనుగుణంగా నవరత్నాలు రూపొందించాం

- స్వాతంత్ర్యం అనేది నినాదమే కాదు... ప్రభుత్వ విధానం కావాలి

- ప్రాథమిక హక్కులు రాజ్యాంగానికి ఆత్మ వంటివని అంబేడ్కర్‌ చెప్పారు

- మన రాజ్యాంగం ఎంతో గొప్పది... ఉన్నత ఆశయాలతో ప్రాథమిక హక్కులు పెట్టారు

- రాజకీయ, ఆర్థిక, సామాజిక అసమానతలు మాయని మచ్చలుగా ఇవాళ్టికీ కనిపిస్తున్నాయి

- ఈనాటికీ ఇంకా చదువురాని వారి సంఖ్య కనబడుతోంది

- ఇప్పటికీ కులాలు, మతాల పరంగా కొందరికి నిరంతరం అన్యాయం జరుగుతోన్న పరిస్థితి

- బడికి వెళ్లలేని పరిస్థితులు ఇంకా ఉన్నాయి

10:19 August 15

సీఎం జగన్ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలోని ముఖ్యాంశాలు

విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో స్వాతంత్య్ర వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. జాతీయ జెండాను ముఖ్యమంత్రి జగన్ ఎగరవేశారు. అంతకు ముందు ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. విధినిర్వహణలో విశేష ప్రతిభ కనబరిచిన పోలీసులకు పతకాలు అందజేశారు. అనంతరం సీఎం ప్రసంగిస్తున్నారు.

బ్రిటీష్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి స్వాతంత్ర్యం సాధించాం

మన దేశాన్ని మనమే పాలించాలి.. మన ప్రభుత్వాన్ని మనమే ఎన్నుకోవాలని స్వాతంత్ర్యం తెచ్చుకున్నాం

మన తలరాతలను మనమే మార్చుకోవాలి.. మానవత్వం నిలిచిపోవాలని స్వాతంత్ర్యం తెచ్చుకున్నాం

ఎన్ని పోరాటాలు, ఎన్ని త్యాగాలు చేయాల్సి వస్తుందో మన స్వాతంత్ర్య ఉద్యమం చెబుతోంది

భారతీయులుగా పుట్టినందుకు గర్వపడుతున్నాం

ప్రధానంగా శాంతి, అహింసా ఆయుధాలుగా స్వాతంత్ర్యం తెచ్చుకున్నాం

ఎందరో దేశభక్తుల త్యాగాల ఫలితమే స్వాతంత్ర్యం

భారతీయుడిగా పుట్టినందుకు గర్విస్తూ భారతమాతకు వందనం చేస్తున్నా

Last Updated : Aug 15, 2019, 1:44 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details