ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

భూవివాదం, పోలీస్​ స్టేషన్​ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం

Woman suicide attempt కోనసీమ జిల్లాలో ఓ మహిళ పోలీస్​ స్టేషన్​ ఎదుట ఆత్మహత్యాయత్నం చేసింది. పొలం విషయంలో స్థానికులు అడ్డుపడుతున్నారని మనస్తాపంతో ఈ ఘాతుకానికి పాల్పడింది. అసలేం జరిగిందంటే.

By

Published : Aug 26, 2022, 7:29 PM IST

Woman suicide attempt
మహిళ ఆత్మహత్యాయత్నం

Woman suicide attempt డాక్టర్​ బీఆర్​ అంబేడ్కర్​ కోనసీమ జిల్లా రాజోలు పోలీసు సర్కిల్ ఆఫీస్ ఎదుట పెట్రోల్ పోసుకుని వివాహిత ఆత్మహత్యాయత్నం చేసింది. సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెం గ్రామానికి చెందిన యర్రంశెట్టి విజయలక్ష్మిగా చెబుతున్న బాధితురాలు మలికిపురం మండలం ఇరుసుమండలోని తన భూమి విషయంలో స్థానికులు అడ్డు తగులున్నారని మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది. తీవ్రగాయాలతో ఉన్న బాధితురాలను స్థానికులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈమెకు భర్త రమేష్, కుమారుడు, కుమార్తె ఉన్నారని తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details