క్షణికావేశంలో పెట్రోల్ పోసుకుని భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెలంగాణ రాష్ట్రం వరంగల్ నగరంలో చోటుచేసుకుంది. తీవ్ర గాయాలతో దంపతులిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. నగరానికి చెందిన బండి భాస్కర్ విజయ దంపతులు తరుచు గొడవ పడుతూ ఉండేవారు. వారి మధ్య వివాదం తలెత్తటంతో క్షణికావేశంలో పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నారు.
వీరికి పదిహేనేళ్ల కుమారుడు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. కుమారుడి పుట్టినరోజుకు ముందు రోజే తల్లిదండ్రులు మృత్యువాత పడటం గ్రామస్థులను కలిచివేసింది. ఆర్థిక ఇబ్బందులతో తరచూ గొడవ జరిగేదని స్థానికులు వివరించారు. కేసు నమోదు చేసిన మిల్స్కాలనీ పోలీసులు.. శవ పరీక్షల కోసం మృతదేహాలను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.