ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 25, 2021, 10:55 AM IST

ETV Bharat / crime

Adilabad Accident Today: రెండు ద్విచక్రవాహనాలు ఢీ.. ముగ్గురు దుర్మరణం

అతి వేగం మూడు నిండు ప్రాణాలను బలికొంది. రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఈ విషాద ఘటన తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది.

Adilabad Accident Today
Adilabad Accident Today

Adilabad Accident: తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఉట్నూరు మండలం కుమ్మరి తండా వద్ద రాత్రి రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. ఘటనాస్థలిలో నార్నూర్‌ మండలం తడిహత్నూర్‌కు చెందిన ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా... రిమ్స్‌లో చికిత్స పొందుతూ పెరికగూడకు చెందిన యువకుడు మృతి చెందాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details