ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తల్లిదండ్రులు మందలించారని బాలిక ఆత్మహత్య

By

Published : Apr 17, 2021, 12:45 PM IST

లాక్​డౌన్​ కారణంతో ఇంట్లోనే ఉంటున్న బాలిక చదువుకోకుండా నిత్యం టీవీ, సెల్​ఫోన్​ చూస్తున్న ఆమెను తల్లిదండ్రులు మందలించారు. మనస్తాపానికి గురైన బాలిక పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తెలంగాణలోని వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తిలో చోరటు చేసుకుంది.

suicide
తల్లిదండ్రులు మందలించారని బాలిక ఆత్మహత్య

తెలంగాణలోని వరంగల్​ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలో బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఏకే తండాకు చెందిన మునవత్, కవిత దంపతుల కుమార్తె లాక్​డౌన్ వల్ల పాఠశాల లేకపోవడంతో బాలిక ఇంటివద్దనే ఉంటుంది. చదువుకోకుండా నిత్యం టీవీ, సెల్​ఫోన్ చూస్తున్న బాలికను తల్లిదండ్రులు మందలించారు.

మనస్థాపం చెందిన బాలిక పురుగుల మందు సేవించి బలవన్మరణానికి పాల్పడింది. తల్లిదండ్రుల మందలింపుతో మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details