ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 25, 2021, 6:51 AM IST

Updated : Aug 25, 2021, 8:10 AM IST

ETV Bharat / crime

ACCIDENT: ఆగిఉన్న ట్యాంకర్‌ను ఢీకొన్న కోళ్ల వ్యాన్.. ఇద్దరు మృతి

accident in vishaka
accident in vishaka

06:50 August 25

గాజువాకలో ప్రమాదం ఇద్దరు మృతి

విశాఖ ఎయిర్ పోర్ట్ -షీలా నగర్ మధ్య జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా.. వ్యాన్ డ్రైవర్​కి గాయాలయ్యాయి. ఆనందపురం నుండి గాజువాక పరిధిలోని శ్రీహరిపురంలో ఉన్న స్టాక్ పాయింట్​కి వ్యాన్​లో కోళ్లు తరలిస్తుండగా ఈ  ప్రమాదం జరిగింది. 

ఎయిర్ పోర్ట్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని.. వ్యాన్​ అతి వేగంగా ఢీకొట్టింది. దీంతో వ్యాన్​లో ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. వ్యాన్ డ్రైవర్ గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న గాజువాక పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వ్యానులో ఇరుక్కుపోయిన మృతదేహాలను వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కేజీహెచ్ కు తరలించారు. మృతులు విశాఖకు చెందినవారేనని పోలీసులు తెలిపారు. 

ఇదీ చదవండి: INTER ANNUAL FEE: ప్రైవేటు జూనియర్‌ కళాశాలల వార్షిక ఫీజులు ఖరారు

Last Updated : Aug 25, 2021, 8:10 AM IST

ABOUT THE AUTHOR

...view details