కేంద్ర మాజీమంత్రి జైపాల్ రెడ్డి మృతి పట్ల తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య ఆవేదన చెందారు. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జైపాల్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. మంచి స్నేహితుడిని కోల్పోయినట్లు చెప్పారు. ఇటీవలే జైపాల్ రెడ్డితో మాట్లాడానని... త్వరలో ఆయనను కలవాలనుకున్నాననీ చెప్పారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మంచి స్నేహితుడిని కోల్పోయా: రోశయ్య
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి జైపాల్ రెడ్డి మృతిపై మాజీ గవర్నర్ రోశయ్య తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంచి స్నేహితుడిని కోల్పోయానని ఆవేదన చెందారు.
Rosaiah reaction on jaipal reddy death