ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సాగర తీరాన పోలీసు క్రీడలు

విశాఖ సాగర తీరాన అఖిలభారత పోలీసు ఆక్వాటిక్, క్రాస్ కంట్రీ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వివిధ రాష్ట్రాల పోలీసు దళాల నుంచి 25 జట్లకు చెందిన 500 క్రీడాకారులు పోటీపడ్డారు.

By

Published : Mar 5, 2019, 10:28 PM IST

అఖిలభారత పోలీసు ఆక్వాటిక్, క్రాస్ కంట్రీ పోటీలు

అఖిలభారత పోలీసు ఆక్వాటిక్, క్రాస్ కంట్రీ పోటీలు

విశాఖలో 67వ అఖిల భారత పోలీసు ఆక్వాటిక్, క్రాస్ కంట్రీ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సాగరతీరంలో ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్​ వేదికగా జరుగుతున్న పోటీలను జిల్లా కలెక్టర్ భాస్కర్, ఏపీఎస్పీ ఐజీపీగోపాలరావు, నగర పోలీసు కమిషనర్​ మహేష్ చంద్ర లడ్డా ప్రారంభించారు.వివిధ రాష్ట్రాల పోలీసు దళాల నుంచి 25 జట్లకు చెందిన 500 క్రీడాకారులు పోటీ పడుతున్నారు.విశాఖలో తొలిసారిగా జరుగుతున్న ఈ పోటీలను విజయవంతం చేసేందుకు రాష్ట్ర పోలీసు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. నగర పోలీస్ కమిషనర్ పర్యవేక్షణలో క్రీడలు నిర్వహిస్తున్నారు. విజేతలకు అతిథులు పతకాలుబహుకరించారు.

ABOUT THE AUTHOR

...view details