ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 12, 2020, 9:27 PM IST

Updated : Jan 12, 2020, 10:07 PM IST

ETV Bharat / city

పవన్​పై మంత్రి వెల్లంపల్లి 'ప్యాకేజ్' వ్యాఖ్యలు!

భాజపా, తెదేపా, జనసేనపై మంత్రి వెల్లంపల్లి తీవ్ర విమర్శలు చేశారు. జనసేనాని పవన్​కు విజన్ లేదని... రాష్ట్రంలో ఏదో దోచేసుకుందామనే ఆలోచనతో ఉన్నారని ఆరోపించారు. అలాగే నిజమైన రైతులు దాడులు చేసే పరిస్థితి ఉండదని మంత్రి అన్నారు. విజయవాడలో ఆందోళనకు వేర్వేరు ప్రాంతాల నుంచి మహిళల్ని తీసుకొస్తున్నారని వెల్లంపల్లి ధ్వజమెత్తారు.

minster vellampalli sensational comments on pawan kalyan
minster vellampalli sensational comments on pawan kalyan

తెదేపా, భాజపా, జనసేనపై మంత్రి వెల్లంపల్లి విమర్శలు

రాజధాని విషయంలో భాజపాలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని.. ఆ పార్టీకి విలువలు లేకుండా పోవడానికి అదే ఆధారమని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. రూ.లక్షా 9 వేల కోట్లు ఇస్తే భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేరుతో రాజధానిని అమరావతిలోనే కొనసాగిస్తామని వ్యాఖ్యానించారు. విశాఖలో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో ఏదో అన్యాయం జరిగిపోతోందంటూ చంద్రబాబు, పవన్‌, కన్నా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రాజధాని రైతులకు న్యాయం చేయాలని సీఎం జగన్‌ చూస్తున్నారన్నారు. నిజమైన రైతులు దాడులు చేసే పరిస్థితి ఉండదని.. భూములు ఇవ్వమంటూ గతంలో రైతులు పోరాటం చేసిన విషయం మర్చిపోకూడదన్నారు. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీలకు అలవాటుపడి పవన్‌ అలా మాట్లాడుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాము ప్యాకేజీ ఇచ్చినా తమకు అనుకూలంగా పవన్ మాట్లాడతారని... అయితే తమకు అలాంటి అలవాటు లేదని అన్నారు.

మహిళల్ని వేరే ప్రాంతాల నుంచి తీసుకొస్తున్నారు

విజయవాడలో ఆందోళనకు వేర్వేరు ప్రాంతాల నుంచి మహిళల్ని తీసుకొస్తున్నారని వెల్లంపల్లి ఆరోపించారు. డబ్బులిచ్చి వారితో ఆందోళనలు చేయిస్తున్నారని.. అలాంటి వారిపై మాత్రమే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. పోలీసులు నమోదు చేసిన కేసుల వివరాలు చూస్తే ఆ విషయం తెలుస్తుందన్నారు. ఆందోళనలు చేసే వారిలో బడా భూస్వాములు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఉన్నారని మంత్రి ఆరోపించారు.

ఇదీ చదవండి:

'అరాచక శక్తులతో దాడి చేయిస్తే వెనుకడుగు వేస్తాం అనుకోవద్దు'

Last Updated : Jan 12, 2020, 10:07 PM IST

ABOUT THE AUTHOR

...view details