ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'విశాఖ ఉక్కు ఉద్యమానికి మీడియా బాసటగా నిలవాలి'

విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకునే ఉద్యమానికి యావత్ మీడియా మద్దతు ఇవ్వాలని... విశాఖలో రాష్ట్ర జర్నలిస్ట్ సంఘాలు పిలుపునిచ్చాయి.

By

Published : Mar 22, 2021, 4:59 PM IST

Journalists Oppose Privatization of vizag steel
విశాఖలో రాష్ట్ర జర్నలిస్ట్ సంఘాల సమావేశం

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమానికి మీడియా బాసటగా నిలవాలని విశాఖలో రాష్ట్ర జర్నలిస్ట్ సంఘాలు పిలుపునిచ్చాయి. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ టీఎల్ఎన్ సభా ప్రాగంణంలో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం, స్టీల్ ప్లాంట్ గుర్తింపు సంఘ కార్మిక నాయకులు, వామపక్షాలు, సంయుక్త సమావేశం నిర్వహించారు.

విశ్రాంత ఆచార్యులు సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘ నాయకులు అమర్, శ్రీనివాస్ రెడ్డిలు సమావేశంలో మాట్లాడారు. విశాఖ ఉక్కు జాతి సంపదని...అందులో కార్మికులకు దేశం అంతా అండగా ఉండాలని కోరారు. ప్రభుత్వ రంగాల్ని ప్రైవేటుపరం చేస్తే దేశ ప్రయోజనాలు దెబ్బ తింటాయని ఆరోపించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details