ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖలో కరెన్సీ, బంగారంతో కన్యకాపరమేశ్వరి అమ్మవారు

విశాఖలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. అమ్మవారిని కరెన్సీ, బంగారంతో అలంకరించారు.

By

Published : Oct 6, 2019, 9:05 PM IST

కరెన్సీ, స్వర్ణాలంకరణలో విశాఖ కన్యాకాపరమేశ్వరి అమ్మవారు

విశాఖలో కరెన్సీ, బంగారంతో కన్యకాపరమేశ్వరి అమ్మవారు

విశాఖ వన్ టౌన్​లోని పురాతన దేవాలయం కన్యకాపరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారిని మహాలక్ష్మి అవతారంలో అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. గర్భాలయంలో అమ్మవారి మూలవిరాట్​ను సుమారు రెండు కోట్ల రూపాయల కరెన్సీతో అలంకరించారు. అలాగే నాలుగు కేజీల స్వర్ణాభరణాలు, బంగారు చీర, కిరీటం, బిస్కెట్స్, సువర్ణ పుష్పాలను అలంకరణలో ఉపయోగించారు. సుమారు 200 మంది భక్తులు తమ సొమ్మును అమ్మవారికి అలంకరణ నిమిత్తం అందజేశారు. అలంకరణ అనంతరం వారి ధనాన్ని వారికీ అందజేయనున్నట్లు నిర్వహకులు తెలిపారు. వీఎమ్ఆర్​డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావు ...అమ్మవారిని దర్శించుకుని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details