విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలన్న నిర్ణయం ఒక్కరోజులో తీసుకుంది కాదని.. భాజపా ఎంపీ సుజనాచౌదరి అన్నారు. ఆర్థిక సంస్కరణల్లో భాగంగా రెండు దశాబ్దాల క్రితమే ఈ మేరకు ఆలోచించడం మొదలైందని స్పష్టం చేశారు. కర్మాగారం విశాఖలోనే ఉంటుందని.. ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పారు.
'ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయం ఒక్కరోజులో తీసుకోలేదు'
దశాబ్దాల నుంచి అనుకుంటున్న విధంగానే.. ఆర్థిక సంస్కరణల్లో భాగంగా విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు భాజపా ఎంపీ సుజనాచౌదరి తెలిపారు. ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై సుజనా చౌదరి వ్యాఖ్యలు