ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కుట్రదారులను శిక్షించండి'

విజయవాడలో శాసనసభ్యుడు  గద్దె రామ్మోహన్ రావు ధర్నా చేశారు. తెదేపా ఓట్లను తొలగింపునకు వైకాపానే కారణమని ఆరోపించారు. కుట్రదారులను కనిపెట్టి వెంటనే అరెస్ట్‌ చేయాలంటూ డిమాండ్ చేశారు.

By

Published : Mar 6, 2019, 2:10 PM IST

Updated : Mar 6, 2019, 9:43 PM IST

గద్దే రామ్మోహన్
విజయవాడలో శాసనసభ్యుడు గద్దెరామ్మోహన్ రావు ధర్నా చేశారు. తెదేపా ఓట్లను తొలగింపునకు వైకాపానే కారణమని ఆరోపించారు. ఫారం 7 ఆధారంగా తెదేపా కార్యకర్తలు, సానుభూతి పరులు ఓట్లను తొలగించిన వారిని కనిపెట్టి కఠినంగా శిక్షించాలని జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్​కు విజ్ఞప్తి చేశారు. తెదేపా విజయావకాశాలు దెబ్బతీసే రీతిలో విజయవాడ తూర్పు నియోజకవర్గంలోనే సుమారు 4 వేల 5వందల ఓట్లను తొలగించినట్లు ఆరోపించారు. రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కును తొలగించడం క్షమించరాని నేరంగా కఠిన శిక్షలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల సమయం వరకూ ప్రతిఒక్కరూ తమ ఓటు ఉందో లేదో తనిఖీ చేసుకోవాలని ఓటర్లను కోరారు.
Last Updated : Mar 6, 2019, 9:43 PM IST

ABOUT THE AUTHOR

...view details