అసెంబ్లీని రద్దు చేసి.. ప్రజల ముందుకు వెళ్దామని చంద్రబాబు విసిరిన సవాల్ను సీఎం జగన్ స్వీకరించాలని తెదేపా నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. జగన్ ప్రజలను మోసం చేసినందున, మొత్తం 13 జిల్లాలు గందరగోళంలో పడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ తుగ్లక్ పాలన నుండి ఏపీని రక్షిద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర భవిష్యత్ కోసం ఐక్యంగా పోరాడాలని కోరారు.