రాష్ట్రంలో కురిసిన వర్షాలకు.. నెల్లూరు-పడుగుపాడు, రాజంపేట-నందలూరు మధ్య రైల్వే ట్రాక్(railway track damaged by floods) దెబ్బతింది. దీంతో ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను మంగళ, బుధవారాల్లో రద్దు చేస్తున్నట్లు.. దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. దెబ్బతిన్న రైల్వే ట్రాక్ మరమ్మతులు వేగంగా జరుగుతున్నాయని వివరించింది.
మంగళ, బుధవారాల్లో నెల్లూరు-పడుగుపాడు, రాజంపేట-నందలూరు మధ్య నడిచే రైళ్ల రద్దు వివరాలు:
రైలు నంబర్ | రైలు పేరు | రైలు రద్దు వారం | |
22160 | చెన్నై సెంట్రల్-సీఎస్టీ ముంబయి | రైలు రద్దు | మంగళవారం |
12164 | చెన్నై సెంట్రల్-ఎల్టీటీ ముంబయి | రైలు రద్దు | మంగళవారం |
22159 | సీఎస్టీ ముంబయి-చెన్నై సెంట్రల్ | రైలు రద్దు | మంగళవారం |
12163 | ఎల్టీటీ ముంబయి-చెన్నై సెంట్రల్ | రైలు రద్దు | మంగళవారం |
22619 | బిలాస్పూర్-తిరునల్వేలి | రైలు రద్దు | మంగళవారం |
12589 | గోరఖ్పూర్-సికింద్రాబాద్ | రైలు రద్దు | బుధవారం |