ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నష్టపరిహారం కోట్లలో ఇస్తున్నా... ఎప్పుడు ఏమౌతుందో అని బెంగతో అక్కడ ఉన్నవారు జీవితాంతం బిక్కుబిక్కుమంటూ బ్రతకాలా..? అని అయ్యన్నపాత్రుడు ప్రభుత్వాన్ని నిలదీశారు. ముఖ్యమంత్రికి పరిశ్రమపై ఉన్న ప్రేమ ప్రజలపై లేదని మండిపడ్డారు.
విశాఖలో విషవాయువు లీకైన ఘటన జరిగి రెండు రోజులైనా... ఎల్జీ పాలిమర్స్ ప్రతినిధులను ప్రభుత్వం ఎందుకు అరెస్టు చెయ్యడం లేదని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. హైపవర్ కమిటీలో కేంద్రప్రభుత్వ సంస్థలకి సంబంధించిన ప్రతినిధులు, సైంటిస్టులు ఎందుకు లేరని నిలదీశారు. విచారణకు నెల రోజుల సమయం ఎందుకని ప్రశ్నించారు.