ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'వారు అఘాయిత్యాలు చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారు'

వైకాపా ప్రభుత్వంపై తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు అఘాయిత్యాలకు పాల్పడుతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు.

By

Published : Oct 18, 2020, 2:22 PM IST

Published : Oct 18, 2020, 2:22 PM IST

vangalapudi anitha
వంగలపూడి అనిత, తెలుగు మహిళ అధ్యక్షురాలు

తూర్పుగోదావరి జిల్లా యర్రంపాడులో బాలికపై వైకాపా కార్యకర్త అత్యాచారం చేస్తే పోలీసులు ఇంతవరకు చర్యలు తీసుకోలేదని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు. అధికార పార్టీ అండతోనే మృగాళ్ళు రెచ్చిపోతున్నారని ఆమె ఆరోపించారు. నేతల అండతో నిందితుడు తప్పించుకునే యత్నం చేస్తున్నాడని దుయ్యబట్టారు.

వైకాపా నేతలు, కార్యకర్తలు అఘాయిత్యాలకు పాల్పడుతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మహిళలపై 300కి పైగా దాడులు జరిగాయని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో దిశ చట్టం ఎక్కడా అమలు కావట్లేదన్నారు. వాలంటీర్ల ఆగడాలకు అంతే లేకుండాపోయిందన్నారు.

ABOUT THE AUTHOR

...view details