Sajjala: 'వైకాపా ప్రభుత్వం వచ్చాకే పోలవరం పనులు వేగవంతం'
పోలవరం ప్రాజెక్టు(polavaram project)ను పూర్తి చేయడాన్ని ముఖ్యమంత్రి జగన్(cm jagan) కర్తవ్యంగా భావించారని సజ్జల రామకృష్ణారెడ్డి(sajjala ramakrishnareddy) అన్నారు. 2018లోనే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావలసి ఉన్నా.. కమిషన్ల కోసం తెదేపా జాప్యం చేసిందని ఆరోపించారు.
సాంకేతిక ఇబ్బందులను దాటుకుని... అనుకున్న సమయానికే పోలవరం ప్రాజెక్టు(POLAVARAM PROJECT) పూర్తిచేసేందుకు ఇంజినీర్ల బృందం కృషి చేస్తోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన ఆధ్వర్యంలో... ప్రజాప్రతినిధుల బృందం పశ్చిమగోదావరిజిల్లాలోని పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు. అధికారులను అడిగి ప్రాజెక్టు ప్రగతిని పరిశీలించారు. పునరావాస పనులూ జోరుగా సాగుతున్నాయని చెబుతున్నారు. కమీషన్లకు కక్కుర్తిపడకుండా గత ప్రభుత్వం శ్రద్ధ చూపి ఉంటే 2018కే పూర్తయ్యేదని సజ్జల (SAJJALA) తెలిపారు.