ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

24న గవర్నర్​ ప్రమాణం.. ముస్తాబవుతోన్న రాజ్​భవన్

రాష్ట్రానికి నూతన గవర్నర్​గా నియమితులైన బిశ్వభూషణ్ హరిచందన్ ఈ నెల24న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 23 సాయంత్రానికే ఆయన విజయవాడకు చేరుకోనున్నారు. ఈలోపే రాజ్​భవన్ పనులు పూర్తి చేయడానికి అధికారులు కృషి చేస్తున్నారు. సకల సౌకర్యాలతో భవనాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు

By

Published : Jul 19, 2019, 6:41 PM IST

నూతన రాజ్ భవన్

రాజ్​భవన్ ముస్తాబు

విజయవాడలో నూతన రాజ్​భవన్ ఆధునీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. గవర్నర్ ప్రమాణ స్వీకారం 24వ తేదీ జరగనున్నందున సిబ్బంది రాత్రింబవళ్లు పనులు చేస్తున్నారు. సకల సౌకర్యాలతో భవనాన్ని తీర్చిదిద్దుతున్నారు. నూతన ఫర్నీచర్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. రాజ్​భవన్​లోని పై అంతస్తులో ఒక వైపు గవర్నర్ నివాసముంటుంది. మరోవైపు అతిథులకు ప్రత్యేక గదులు, ప్రెసిడెన్స్ రూంలుగా అధికారులు కేటాయించారు. గ్రౌండ్ ఫ్లోర్​లో గవర్నర్ కార్యాలయం, డెలిగేషన్ రూంలను ఏర్పాటు చేశారు. జీఏడీ పొలిటికల్ సెక్రటరీ సిసోడియా పూర్తి స్థాయిలో పనులను పర్యవేక్షించి సిబ్బందికి సూచనలు చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని రాజ్​భవన్ ప్రాంగణంలోనే జరపనున్నందున... దీనికి సంబంధించి ఇప్పటినుంచే ఏర్పాట్లు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details