రాహుల్, విజయ్కుమార్ మధ్య వివాదాన్ని అనుకూలంగా మార్చుకుని.. కంపెనీని తక్కువ ధరకే సొంతం చేసుకునేందుకు కోగంటి సత్యం పథకం వేశాడని.. రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు తెలిపారు. ఒంగోలుకు చెందిన రాహుల్.. ముగ్గురి భాగస్వామ్యంతో కృష్ణా జిల్లా జీ.కొండూరులో ‘జిక్సిన్ సిలిండర్స్’ అనే కంపెనీ స్థాపించారని నివేదికలో వెల్లడించారు. ఇందులో రాహుల్కు 40 శాతం, విజయకుమార్కు 30 శాతం వాటా ఉందని వివరించారు. మిగిలిన 30 శాతంలో.. బొబ్బా రాహుల్ చౌదరి అనే వ్యక్తికి 20, బొబ్బా స్వామి కిరణ్కు 10 శాతం వాటా ఉందని తెలిపారు. కంపెనీ రోజువారీ వ్యవహారాలను రాహుల్ పర్యవేక్షించేవారు. ఇక విజయకుమార్.. 2019లో జరిగిన ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ సమయంలో డబ్బు ఖర్చు చేయడం వల్ల.. ఆర్థికంగా చితికిపోయాడని.. పోలీసులు రిపోర్ట్లో వివరించారు.
ప్రతిపాదన తిరస్కరించడంతో..
అప్పులిచ్చినవారి ఒత్తిళ్లతో.. కంపెనీలో తన వాటా తీసుకుని డబ్బు ఇవ్వాలంటూ.. రాహుల్ను కోరారని తెలిపారు. అందుకు రాహుల్ అంగీకరించకుండా.. వేరొకరిని సంప్రదించమని చెప్పారని..రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న విజయకుమార్.. కోగంటి సత్యంను సలహా కోరారు. జిక్సిన్ కంపెనీలో 90 శాతం వాటా తనకు ఇచ్చేయాలన్న సత్యం.. నామమాత్రపు ధర నిర్ణయించాడని పోలీసులు నివేదికలో తెలిపారు. ఈ ప్రతిపాదనను రాహుల్ తిరస్కరించటంతో.. తీవ్ర ఒత్తిడి తెచ్చాడన్నారు. ఎంతకీ వినకపోయేసరికి.. రాహుల్ను విజయకుమార్, సత్యం బెదిరించారని పోలీసులు వివరించారు. అప్పటికీ ఫలితం లేక..రాహుల్ హత్యకు సత్యం కుట్ర పన్నాడని తెలిపారు. హత్యలో కోగంటి సత్యం పాత్రకు సంబంధించి ఆధారాలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. కోగంటిపై విజయవాడ కమిషనరేట్ పరిధిలోని పోలీసస్స్టేషన్లలో.. 24 క్రిమినల్ కేసులతో పాటు.. పటమట స్టేషన్లో రౌడీషీట్ ఉందని తెలిపారు. ఇంకా విచారించాల్సి ఉన్నందున జ్యుడీషియల్ రిమాండ్ విధించాలన్న పోలీసుల విఙ్ఞప్తితో... న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.
బెంగుళూరులో చిక్కాడు..