ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలకు మూడు వేల మందితో బందోబస్తు

విజయవాడ నగర కార్పొరేషన్ ఎన్నికలకు మూడు వేల మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు సీపీ తెలిపారు. 199 ప్రాంతాల్లో పోలింగ్ జరుగనుందని స్పష్టం చేశారు.

By

Published : Mar 4, 2021, 5:32 PM IST

vijayawada cp srinivasulu
విజయవాడ సీపీ బీ శ్రీనివాసులు

విజయవాడ నగర కార్పొరేషన్ ఎన్నికలకు మూడు వేల మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటుచేయనున్నట్లు సీపీ బీ శ్రీనివాసులు తెలిపారు. 60 శాతానికి పైగా సమస్యాత్మక ప్రాంతాలున్నట్లు గుర్తించామన్నారు. అతి సమస్యాత్మక ప్రాంంతాల్లో నిఘా పెంచనున్నామన్నారు. పోలింగ్ రోజున 100 పెట్రోలింగ్ బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నగర పరిధిలో లైసెన్స్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. 199 ప్రాంతాల్లో పోలింగ్ జరగనుందని విజయవాడ సీపీ శ్రీనివాసులు స్పష్టం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details